పెళ్లైన 3 నెలలకే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాళీపట్నం పడమరకు చెందిన జక్కంశెట్టి ధర్మారావు గతేడాది కరోనాతో మృతిచెందగా అప్పటి నుంచి కుమార్తె అశ్విని(23) దిగాలుగా ఉండేది. ఆమెకు 3 నెలల క్రితం భీమవరం మండలం దిరుసుమర్రుకు చెందిన వేండ్ర రామకృష్టతో వివాహం జరిగింది. ఇటీవల సంక్రాంతి పండుగకు అశ్విని కాళీపట్నం వచ్చింది. గురువారం అర్దరాత్రి బైక్ పై ఒంటరిగా ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవు ప్రాంతంలోని జాతీయ రహదారి వంతెన వద్దకు చేరుకుంది. సెల్ ఫోన్ ను అక్కడ వదిలేసి గొంతేరు డ్రెయిన్ లోకి దూకేసింది. కుటుంబ సభ్యులు చింతరేవు వంతెన వద్ద బైక్ గుర్తించి డ్రెయిన్లో గాలించారు. వంతెన సమీపంలోని ముత్యాలపల్లి రేవు వద్ద మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలి తల్లి తులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.