చిత్తూరుజిల్లా కుప్పం నియోజక వర్గంలో ఉన్న ద్రావిడ విశ్వవిద్యాలయంపై కరోనా పంజా విసిరిందనే చెప్పాలి. ఈ విద్యాలయంలో తాజాగా 20 మంది ఉపాధ్యాయులు,45 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ ఐనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ద్రావిడ విశ్వద్యాలయంలో చదువుతున్న విద్యార్థులకు,సిబ్బందికి అందరికి కరోనా పరీక్షలు చెయ్యడం ప్రారంభించారు .