ప్రకాశం జిల్లాలోని పామూరు మండలం ఉప్పుకయ్యవంకలో విషాద ఛాయలు అలుముకున్నాయి, పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇనిమెర్ల గ్రామానికి చెందిన దంపతులు పురుగుల మందు తాగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దంపతుల ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.