ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ పై కరోనా పంజా.. కొత్తగా 1827 కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 19, 2022, 09:34 PM

విశాఖ పై కరోనా పంజా విసింది, దానితో జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1827 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో ఇప్పటివరకు 1,69,013 కేసులు నమోదయ్యాయి. 1,58,729 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 9,137 మంది చికిత్స పొందుతున్నారు. 1148 మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. అవసరమైతే బయటకు రావాలన్నారు. ముఖానికి మాస్క్ ధరించాలి. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com