విజయవాడ లో సిగరెట్ కోసం స్నేహితుల మధ్య గొడవ జరిగింది. 4 రోజుల క్రితం హరిణి సాయి అనే యువకుడు సిగరెట్ ఇవ్వలేదని తన స్నేహితుడిని కొట్టాడు. ఈరోజు సాయి హరితో అతని సోదరుడు వాగ్వాదానికి దిగాడు. వివాదం ముదిరిపోవడంతో అన్నదమ్ములు గాజు సీసాలతో సాయిని చితకబాదారు. ఈ దాడిలో సాయి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సాయిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.