మంచుతో ప్రయాణాలు జరభద్రం అని కె. వి. కె సైంటిస్టులు సూచిస్తున్నారు. శనివారం వేకువజామున కురిసిన మంచు ప్రమాదభరితంగా ఉందని, దీనివల్ల ప్రయత్నాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకొని వేకువజాము ప్రయాణాలు చేయాలని ప్రయాణాలు చేసేటప్పుడు తలకు గుడ్డ చుట్టుకోవాలి అని కళ్ళకు రక్షణగా రహదారి కనబడేటట్లు కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచించారు. అలాగే రైలు మంచు వల్ల వేగం తగ్గించి గమ్యస్థానాలకు చేరుకోవడంతో ఆలస్యం అవుతుందని రైల్వే సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితిలో కొద్దిరోజుల ఉంటాయని రైల్వే సిబ్బంది తెలిపారు.