శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జనసేన పార్టీ ఇంచార్జ్ పెరాడ రామ్మోహన్ సోమవారం వ్యవసాయ కార్మికుల తో కలిసి విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు నిరసనగా మా పార్టీ అధినాయకుడు పిలుపుమేరకు ఈ డిజిటల్ క్యాంపెయిన్ను నిర్వహించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో లో జనసేన పార్టీ కార్యకర్తలు వ్యవసాయ మహిళలు పాల్గొన్నారు.