రాయలసీమ, ఉత్తరాంధ్ర.... ఇలా ప్రాంతమేదైనా రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని శ్రీకాళహస్తి ప్రజలు తేల్చిచెప్పారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న మహిళా రైతులకు ఘనస్వాగతం పలికారు. అడుగులో అడుగేస్తూ రైతుల పోరాటంలో న్యాయం ఉందంటూ మద్దతు పలికారు. రాయలసీమ ప్రజలు తమపట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలు అపూర్వమైనవని రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు.