అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల పరిధిలోని కొండూరు అటవీప్రాంతంలో చిరుత సంచరిస్తుందని పశువుల కాపరులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది నాగన్నకుంట నుంచి చిరుతలకుంట వరకు యువకులతో కలిసి గాలింపుచర్యలు చేపట్టారు. అయితే చిరుత సంచరించిన ఆనవాళ్లు తొరికాయి. చిరుత ఆచూకి లభించకపోవడంతో చుట్టుపక్కల గ్రామస్థులకు హెచ్చరికలు జారీచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పశుకాపరులు అడవుల్లోకి వెళ్లరాదన్నారు. తదుపరి అటవీశాఖ ఆదేశాలు ఇచ్చేవరకు కట్టెలకుకానీ, ఏ పనులకు కానీ వెళ్లకూడదని వారు గ్రామస్థులకు తెలిపారు.