ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండూరు అటవీప్రాంతంలో చిరుత సంచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 08, 2021, 01:11 PM

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల పరిధిలోని కొండూరు అటవీప్రాంతంలో చిరుత సంచరిస్తుందని పశువుల కాపరులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది నాగన్నకుంట నుంచి చిరుతలకుంట వరకు యువకులతో కలిసి గాలింపుచర్యలు చేపట్టారు. అయితే చిరుత సంచరించిన ఆనవాళ్లు తొరికాయి. చిరుత ఆచూకి లభించకపోవడంతో చుట్టుపక్కల గ్రామస్థులకు హెచ్చరికలు జారీచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పశుకాపరులు అడవుల్లోకి వెళ్లరాదన్నారు. తదుపరి అటవీశాఖ ఆదేశాలు ఇచ్చేవరకు కట్టెలకుకానీ, ఏ పనులకు కానీ వెళ్లకూడదని వారు గ్రామస్థులకు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com