శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల సౌతాఫ్రికా నుంచి ఉమిలాడ గ్రామానికి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఇంకా ఒమిక్రాన్ అని తేలలేదని సంతబొమ్మాళి ఎమ్మార్వో ఆదిబాబు తెలిపారు. అతని శాంపిల్స్ జీనోమ్ స్వీక్వెన్సింగ్కు పంపామని పేర్కొన్నారు. గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించామని వివరించారు.