ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 30,747 మంది కి కరోనా పరీక్షలు చేయగా అందులో 184 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కృష్ణా జిల్లాలో ఎక్కువగా 34 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి, శ్రీకాకుళం జిల్లాలో 22 కరోనా కేసులు వచ్చాయి , విశాఖ జిల్లాలో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు, ఇద్దరు మృతి చెందారు.