మంగళగిరి పట్టణంలో కనిపించకుండా పోయిన నలుగురు పిల్లల ఆచూకీ లభ్యమైంది. మంగళగిరి పట్టణం రాజీవ్ గృహకల్ప ప్రాంతానికి చెందిన నలుగురు పిల్లలు సోమవారం రాత్రి నుండి కనిపించలేదు. దీంతో మంగళగిరి పట్టణ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.సోమవారం రాత్రి పొన్నూరు మండలం బళ్ళరిపాలెం వెళ్లి అక్కడ నుండి ఉదయం బాలలు మంగళగిరి చేరుకున్నారు. అప్పటికే సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలని పోలీసులు విడుదల చేసారు. మంగళగిరి నృసింహుని ఆలయం వద్ద తిరుగుతున్న పిల్లల్ని చూసిన స్థానిక యువకుడు బాలలని పోలీసు స్టేషన్ కు తరలించాడు. పిల్లలను పోలీసులు విచారిస్తున్నారు. పిల్లలు సురక్షితంగా దొరకడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.