జిజిహెచ్ ఎదుట జూనియర్ డాక్టర్ల ఆందోళన చేపట్టారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో సోమవారం ఒక వైద్యుడు పై రోగి బంధువులు దాడి చేశారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న మాపై రోగి బంధువులు ఆవేశపడి దాడులు చేయడం ప్రతి సారి పరిపాటిగా మారిందంటూ, మంగళవారం మధ్యాహ్నం జిజిహెచ్ ఎదుట విధులు బహిష్కరించి జూడాలు ఆందోళన చేపట్టారు.
దాడిచేసిన వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు విడుపు బహిష్కరించడంతో జీజీహెచ్ లో వైద్యుల సేవలు నిలిచిపోయాయి. జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి వైద్యులతో నిరసన విరమించి పేషంట్లకు వైద్యం చేయాలని, సూచించారు.