ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం నిర్భంద వసూళ్లకు పాల్పడుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు*. అధికారులకు టార్గెట్ ఇచ్చి అక్రమంగా ఓటీఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు.మీడియా ముఖంగా నిరూపించడానికి బహిరంగ చర్చకు నేను సిద్ధం.. మంత్రి బొత్స అబద్ధాలడుతున్నారని, ముఖ్యమంత్రికి జగన్నే సవాల్ చేస్తున్నాని ఆయన అన్నారు. నిరూపించపోతే మేము రాజీనామా చేస్తాం.. నిరూపిస్తే ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధమా అంటూ ఆయన ఆగ్రహించారు. ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇచ్చినా నాబార్డ్, హడ్కో, ఇతర బ్యాంకులు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. హక్కు పత్రాలు ఇవ్వడానికి మీరెవరూ.. ఫోటోలు పెట్టుకుని ప్రజలనుబుకాయిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.