ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్యది కీలక పాత్ర: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 04, 2021, 08:40 PM

రోశయ్య కన్నుమూసిన విషయం తెలిసిందే. లో-బీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ సీఎం జగన్ ఫోన్ చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమని కొనియాడారు. రోశయ్య మరణం రాష్ట్రానికి తీరని లోటని జగన్ అన్నారు. అదేవిధంగా  రోశయ్య మరణం పై చంద్ర బాబు స్పందిస్తూ రాష్ట్ర రాజకీయాలకు రోశయ్య  అజాత శత్రువని.. కాంగ్రెస్‌కు రోశయ్య పెద్ద ఆస్తిగా ఉండేవారన్నారు. క్లిష్ట సందర్భాల్లో అసెంబ్లీలో రోశయ్య పాత్ర కీలకమని చంద్రబాబు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com