ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నగర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతూ ముగ్గురు స్టూడెంట్స్.. పట్టుబడ్డారు. ఈ ముగ్గురు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులుగా విచారణలో తేలింది. వీరిలో ప్రధాన నిందితుడు రేవంత్గా గుర్తించామని, ప్రస్తుతం అతని కోసం వెతుకుతున్నాం అని తెలిపారు. ఈ ఘటన శనివారం జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసారు. వారి దగ్గర నుండి రూ.8,200 రూపాయల నగదు.. 3 స్ట్రిప్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితుల్లో పట్టుబడ్డ వారు ఇద్దరు హరీశ్ ,రాజు తెలంగాణకు చెందినవారుకాగా, మరొకరు గుంటూరుకు చెందిన కిషోర్ రెడ్డిగా గుర్తించామన్నారు. వీరి పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పర్చనున్నట్టు పోలీసులు తెలిపారు.