ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయమ్మ అయినా.. నారా భువనేశ్వరి అయినా మాకు ఒకే గౌరవo: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 04, 2021, 05:22 PM

టీడీపీ నేత చంద్రబాబు నాయుడు  సతీమణి నారా భువనేశ్వరి పై అధికార వైసీపీ ఎమ్మెల్యేల దారుణ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు.. మీడియా సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నా విషయం తెలిసిందే.. ఈ కారణం గానే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియా సాక్షిగా క్షమాపణలు కూడా కోరారు. అయినా ఈ గొడవ సర్దుమణిగేలా లేదు.. తాజాగా ఇదే విషయం పై మరో వైసీపీ నేతల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు చింతుస్తున్నామని అన్నారు.
అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై, ప్రస్తుత పరిస్థితులపై ప్రజలకు వివరించాలని.. దీనికోసం గ్రామాల వారీగా టీడీపీ ప్రజా గౌరవ సభలను నిర్వహించాలని తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. తాజాగా ఇదే అంశంపై కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రజా గౌరవ సభలపై ఎమ్మెల్యే రాచమల్లు పలు వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రజా గౌరవ సభల పేరుతో అందరికీ సోదరి సమానులైన చంద్రబాబు సతీమణి శీలాన్ని బజారుకీడ్చడం బాధాకరమంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను ఇలాంటి సభల ద్వారా మరింత బాధపెట్టడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అయినా.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అయినా తమందరికీ.. ఒకే గౌరవమంటూ ఆయన అన్నారు. ఎవరైనా ఏ మహిళనైనా కించపరిచడం సరైంది కాదన్నారు. ఎవరు చేసినా అది తప్పే అంటూ మండిపడ్డారు. ఈ విషయానికి ముగింపు పలకాలని తాను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నానంటూ సూచించారు. నిజంగా భువనేశ్వరి అక్క.. తనని అనరాని మాటలు అని, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆమె అనుమతి ఇస్తే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలమంతా కలిసి కన్నీటితో కాళ్ళు కడుగుతామంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com