నేడు విజయవాడలో జరుగుతున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సోము వీర్రాజు పాల్గొన్నారు . ఈ సందర్బంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ... మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే నైతిక హక్కు. ముఖ్యమంత్రి జగన్ కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన.ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో భాజపాకే చిత్తశుద్ధి ఉందని అన్నారు.