అనంతపురం: అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం ధర్మవరం పట్టణంలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేశవ నగర్ కు చెందిన దాసరి లోకేష్(32) చేనేత కార్మికుడిగా జీవనం సాగించే వాడని అయితే గత కొంత కాలంగా పట్టు చీరలకు సరైన గిట్టుబాటు ధరలు లేక జీవనోపాధి కోసం కొంతమేర అప్పు చేశాడని రోజురోజుకు అప్పుల బాధ అధికమవడంతో శుక్రవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.