వజ్రపుకొత్తూరు మండలం, ఉద్దానం గోపినాధపురం గ్రామంలో జవాద్ తుపాన్ కారణంగా వీస్తున్న గాలులకు కొబ్బరిచెట్టు పడి గోరకల ఇందు అనే ఇంటర్ విద్యార్థిని మృతిచెందడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు.మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించడం జరిగింది. ఈసందర్భంగా మంత్రివర్యులు మృతిరాల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చి భరోసా కల్పించారు.