ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యల వలయంలో ఆ గ్రామ పాఠశాల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 03, 2021, 02:02 PM

అనంతపురం: కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని బ్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వ పెద్దల మాటలు వట్టిమాటలే అవుతున్నాయి. నాడు-నేడు పథకంలో భాగంగా కొన్ని పాఠశాలలను మాత్రమే ఎంపిక చేసి వాటిని అరకొరగా అభివృద్ధి చేసినా. మిగిలిన పాఠశాలలను గాలికి వదిలేశారు. దాంతో అవి పూర్తిగా అద్వాన్నంగా మారి విద్యార్థుల చదువులకు గుదిబండగా మారుతున్నాయి.


అందుకు నిదర్శనం హిందూపురం మండలంలోని దేమకేతేపల్లి పంచాయతీ ఓబుళాపురం గ్రామ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో 33 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలకు రెండు భవనాలు ఉన్నా. ఒకటేమో పూర్తీగా శిధిలావస్తకు చేరుకుంది. ఉన్న మరొక్క భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. అది కూడా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దవుతోంది. వర్షం వస్తే వర్షపునీరంతా లోపలికి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దాంతో పిల్లలకు బోధన చేయడం కష్టంగా మారుతోందన్నారు. పాఠశాల ఆవరంలో కూడా వర్షపునీటి నిల్వలు ఉండిపోయి మురుగుతోందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాఠశాలను అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com