అన్నదాతలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన హెచ్వీడీఎస్ పథకం అన్నదాతలకు అదనపు భారంగా మారుతోంది. నిబంధనల పేరుతో కొందరు విద్యుత్తు శాఖ సిబ్బంది చేస్తున్న అడ్డగోలు వసూళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రగొండపాలెం సబ్ డివిజన్ పరిధిలోని వై. పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలలో ఈ ఏడాది మార్చి నుంచి ఈ పథకం పనులు మొదలయ్యాయి.
ఇప్పటికే ఉన్న 100, 63 కేవీఏ పరివర్తకాల పరిధి లోని మోటార్లకు ఈ పథకం కింద 25, 16 కేవీఏ పరివర్తకాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. స్థానిక సిబ్బంది అనధికార మోటార్ల వివరాలు సేకరించి సంబంధిత రైతుల నుంచి డీడీలు కట్టించుకొని కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పద్ధతి క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు.
నిబంధనల మేరకు మోటారుకు ఒక్కో హెచ్. పి. కి రూ. 940 చొప్పున 10 హెచ్. పి మోటారుకు రూ. 9, 400 కట్టాలి. రైతులే నేరుగా మీ సేవ కేంద్రాలు, సచివాలయాల్లోనే డీడీలు చెల్లించవచ్చు. అయితే కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం మీరు కట్టుకుంటే కనెక్షన్ పరివర్తకాల ఏర్పాటులో కొందరు అధికారుల చేతివాటం చూపుతున్నారు.
రిలీజ్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. మేము కడితే త్వరగా వస్తుంది. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలున్నా చూసుకుంటాం. అంటూ ఒక్కొక్కరి వద్ద రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగదు ఇవ్వని రైతులకు కనెక్షన్ ఇవ్వడంలో ఇబ్బందులు పెడు తుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వై. పాలెం సబ్ డివిజన్ పరిధిలో హెచ్పీడీ ఎస్ జరుగుతున్న సబ్ స్టేషన్ల పరిధిలో మోటార్ల క్రమబద్ధీకరణ, నూతన కనెక్షన్ల కోసం వై. పాలెం మండలంలో 1, 121 డీడీలు రాగా ఇంకో 550 సర్వీసులు రిలీజ్ చేయాల్సి ఉంది.
దాదాపు 400 పరివర్తకాలు బిగించారు. త్రిపురాంతకం మండలంలో 56 డీడీలు తీసి రైతులు దరఖాస్తు చేశారు. పుల్లలచెరువు మండలం తెల్లగట్ల పరిదిలో ఇటీవలే పనులు ప్రారంభించారు.
ఏది ఏమైనా రైతులకు సాయం చేయాల్సిన అధికారులు వారి నుండి పైసా వసూళ్లకు పడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు వీటిపై నిఘా ఉంచాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.