జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం ప్రజల్లో టెన్షన్ పెడుతోంది. ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా పల్లెసారధిలో ఎలుగుబంటి జనావాసాల్లోకి వచ్చేసింది.వీథుల్లో పరుగులు తీస్తూ భయాందోళనకు గురిచేసింది. ఎలుగుబంటిని గ్రామస్తులు తరిమివేయడంతో తోటల్లోకి వెళ్లింది. ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.