విశాఖపట్టణం: జీవీఎంసీ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆర్టీసీ కాంప్లెక్స్, జీవీఎంసీ కార్యాలయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పల్సర్ బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిని ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడు అయ్యప్ప మాల ధారణలో ఉన్నాడన్నారు.