విశాఖ ఏజెన్సీ ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ ప్రాంతంలో చలి వణికిస్తోంది. గణనీయంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అరకులోయ ప్రాంతంలో చలి ప్రభావం పెరిగింది. దీనితో గిరిజనులు ఇళ్లలాకే పరిమితమవుతున్నారు. సాయంత్రం ఐదు గంటలు అవ్వగానే గిరిజనులు ఇళ్లలాకు చేరుకుంటున్నారు. తెల్లవార్లు 10 గంటలు దాటితేనే గాని ఇల్లు విడిచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చలి స్వెటర్లు ధరించి రాత్రుళ్లు చలిమంటలు వేసుకుంటున్నారు. కూలి పనులకు వెళ్లే కూలీలు రోజు వారి విధులకు వెళ్లే ఉద్యోగస్తులు అయితే చలి ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరి నెల వరకు విశాఖ మన్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.