విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని టోకురు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇది కాస్త కొట్లాటకు దారి తీయడంతో ముగ్గురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తండ్రి కుమారులు కావడం గమనార్హం. కాగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన పోలీసులు గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
బగ్మారవలస గ్రామానికి చెందిన కిల్లో. కోమటి చేతబడి చేస్తున్నారని నేపధ్యంలో గ్రామస్తుడు గోల్లోరి. డొంబు అతని కుటుంబికులు గత కొంతకాలంగా అనుమానించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇరు కుటుంబాల వారు మరోమారు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో కోమటి కుమారుడైన బలరాంపై డొంబు కుమారుడు సుబ్బారావు కత్తితో దాడి చేశాడు. దీనిని అడ్డుకునేందుకు కోమటి ప్రయత్నించగా అతని ఛాతీపై కత్తిపోటు పడింది. గాయపడిన కోమటి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇదే సమయంలో కోమటి మరో కుమారుడైన భగవాన్ పైన సుబ్బారావు కత్తితో దాడి చేశాడు అతను కూడా తీవ్ర గాయాలయ్యాయి.
దీనితో కోమటి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహంతో మరణయుధాలతో డొంబు సుబ్బారావులపై దాడి చేశారు. డొంబు తీవ్రగాయాలతో అక్కడి నుంచి తప్పించుకోగా సుబ్బారావు మృతి చెందాడు. అనంతరం స్థానికులు 108 అంబులెన్స్ సమాచారం ఇచ్చారు కొద్దిసేపటి తర్వాత అంబులెన్స్ రావడంతో సుబ్బారావు కోమటి బలరం భగవాన్ లను చికిత్స నిమిత్తం అనంతగిరి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుబ్బారావు మృతి చెందాడు. మిగిలిన ఇద్దరిని చికిత్స అందించి విశాఖ కేజీహెచ్ కు తరలించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డొంబు కోసం గాలిస్తుండగా సమీపంలో రోడ్డు పక్కన మృతి చెంది పడి ఉన్నాడు. పోలీసులు దగ్గర వెళ్లి పరిశీలించగా ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు.