అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సాయినగర్ లో సోమశేఖర్ (15) అనే బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు వ్యసనాలకు అలవాటు పడడంతో పద్దతి మార్చుకోమని కుటుంబ సభ్యులు గట్టిగా చెప్పడంతో దీని జీర్ణించుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో మృతుని తల్లి బాధ వర్ణనాతీతం మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం నిమిత్తం బాలుడు శవాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.