శ్రీకాకుళం జిల్లా మంత్రి సీదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీఆర్వోలు సచివాలయాలకు వస్తే వారిని తరమాలంటూ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై వీఆర్వోల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోలు నిరసనలు చేపట్టారు. శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. మంత్రి అప్పలరాజు క్షమాపణలు చెప్పాలని వీఆర్వోలు డిమాండ్ చేస్తున్నారు.