ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ కళాశాలలోకి ప్రవేశించిన చిరుతపులి బీభత్సం సృష్టించింది. అలీగఢ్ జిల్లా ఛర్రా ప్రాంతంలోని ఇంటర్ కళాశాలలోకి ప్రవేశించిన చిరుత..ఓ విద్యార్థిపై దాడి చేసింది. చిరుత పులి కళాశాలలోకి రాగా విద్యార్థులంతా భయాందోళనకు గురయ్యారు. అందరూ కళాశాల బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిపై చిరుత దాడి చేసింది. అదృష్టవశాత్తు అతడు గాయాలతో బయటపడ్డాడు. క్లాస్ రూంలోని కుర్చీల మధ్య చిరుత తిరుగుతున్న దృశ్యాలు.సీసీటీవీలో రికార్డయ్యాయి. బుధవారం ఉదయం 10గంటల సమయంలో చిరుత కళాశాలలోకి ప్రవేశించినట్లు ప్రిన్సిపల్ నిహాల్ సింగ్ తెలిపారు. పులి దాడిలో గాయపడ్డ విద్యార్థిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.