గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలో. ఒక వర్గానికి చెందిన క్వారీ కార్మికులను 10 రోజుల నుంచి పనిలోకి రాకుండా బహిష్కరించారని కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాము తెదేపా కౌన్సిలర్లు గెలిచేందుకు కృషి చేశామన్నారు. దాని కారణంగానే 10 రోజుల నుంచి పనిలోకి రానివ్వట్లేదని ఆరోపించారు. సుమారుగా 50 కుటుంబాలు క్వారీలో పని లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే... కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు.. పోరాటం కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.