విశాఖలోని ఆంధ్రవర్సిటీలో దక్షిణ భారత రాష్ట్రల నైపుణ్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను.రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసే ఆలోచనలతో రాష్ట్రం ముందడుగు వేస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారులు ఈ కార్యక్రమంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. దక్షిణ భారత రాష్ట్రాల యువతీయువకులు, నైపుణ్య పోటీదారులంతా ఇప్పటికే విజేతలయ్యారని, త్వరలో నైపుణ్యం, అంకితభావం, పోరాట పటిమతో జగజ్జేతలుగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.