ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతకు పెద్దపీట వేసే ఆలోచనలతో రాష్ట్రం ముందడుగు : మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 02, 2021, 12:28 PM

విశాఖలోని ఆంధ్రవర్సిటీలో దక్షిణ భారత రాష్ట్రల నైపుణ్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. 4 రోజుల పాటు జరిగే  ఈ కార్యక్రమాలను.రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసే ఆలోచనలతో రాష్ట్రం ముందడుగు వేస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారులు ఈ కార్యక్రమంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. దక్షిణ భారత రాష్ట్రాల యువతీయువకులు, నైపుణ్య పోటీదారులంతా ఇప్పటికే విజేతలయ్యారని, త్వరలో నైపుణ్యం, అంకితభావం, పోరాట పటిమతో జగజ్జేతలుగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com