ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రెడ్డి పాలెం గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటర్ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు పొన్నలూరు చెరువులోకి దూసుకెళ్లింది. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. కందుకూరు నుంచి కనిగిరికి ఆర్టీసీ బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చెట్లు అడ్డుగా ఉండటంతో చెరువులోకి పడిపోకుండా ఆగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఎలంటి ప్రాణాపాయమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.