తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడడంతో 4 చోట్ల రోడ్డు దెబ్బతింది. దీని మరమ్మత్తు కోసం ఐఐటి నిపుణులు వస్తున్నారు. ఇప్పటికే రెండో ఘాట్ రోడ్డు పూర్తిగా మూసేశారు. ఒక ఘాట్ రోడ్డు ద్వారా ట్రాఫిక్ క్రమబద్దికరిస్తూ అనుమతిస్తున్నారు. రోడ్డు మరమ్మత్తుకు 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కావున ఈ 3 రోజులు భక్తులు తిరుమలకు రాకపోవడం మంచిదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దర్శనం టికెట్లు ఉన్న వారికి 6 నెలల్లో ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తామన్నారు.