ఓవైపు భారీ వర్షాలు మరోవైపు ఏనుగుల దాడులతో రైతన్నలు లబోదిబో మంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడుపల్లి మండలం సోడిగానిపాళ్యం గ్రామ పరిసరాల్లో సోమవారం వేకువజామున 8 ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి. రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసారు. గ్రామనికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులు, అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 45 బస్తాల వడ్లును తిన్నంత సేపు తిని వడ్ల బస్తాలను ధ్వంసం చేసాయి. ఆరుగాళం ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏనుగులు ధ్వంసం చేయడంతో ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఫారెస్ట్ అధికారులు స్పందించి తమకు నష్ట పరిహారం అందజేయాలని రైతు కోరుకుంటున్నాడు.