తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖలోని ఆధ్మాత్మిక కార్యక్రమానికి హాజరైన ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి ఆయన శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. 2007లో రిటైర్మెంట్ అయినా ఆయన సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్డీగా కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో ఆయన తరించారు. కాగా డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీవ్రనష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు టీటీడీలో భర్తీకాదని అభిప్రాయపడ్డారు.