టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాసారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ. 6054 కోట్ల నష్టం వాటిల్లితే.. కేవలం రూ. 35 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేసింది ప్రభుత్వం. ఇది సరైన పద్దతి కాదు. ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పు పట్టింది. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ నిబంధనలకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అలాగే, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారిని ఆదుకోవాలని కోరారు. ఏపీలో వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. అనేక ప్రాంతాల్లో రైతులు పంటలు నష్టపోయారని ఆయన అన్నారు. అలాగే, ముంపు ప్రాంతాల్లో నిరాశ్రయులకు సాయం అందించాలని ఆయన కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సాయం అందించాలని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, మిగిలిన బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బ తిన్నాయని, తుఫాను, వరద తగ్గి చాలా రోజులైనా ఇప్పటికీ బాధితులు తిండి, వసతి లేక రోడ్ల మీదే ఉన్నారని, చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు