తిరుపతి భవానీనగర్లో కళాశాల దగ్గరలో అరవై ఏళ్ల క్రితం నిర్మించిన మూడు అంతస్తుల భవనం రాత్రి కుప్పకూలింది. అయితే శిథిలావస్థకు చేరిన భవనం కావడంతో రెండు ఏళ్ల క్రితం యజమానులు ఖాళీ చేశారు.ఈ మధ్య కురుస్తున్న వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న భవనం భారీ శబ్ధంతో ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానిక ప్రజలు భయపడ్డారు. ఆ భవనం చుట్టూ నాలుగైదు అంతస్తుల భవనాలు ఉండగా వాటిలో నివసిస్తున్న ప్రజలు అంత పరుగులు తీశారు.ఈ సంఘటనాలో ఎటువంటి ప్రాణ నష్టంజరగలేదు. కుప్పకూలిన భవనం యజమాని ఎంజీ శ్రీనివాసన్ తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు.