శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో 108 అంబులెన్స్ ఇంటర్ సిటీ ట్రైన్ ఢీ కొట్టింది. అంబులెన్స్ను ట్రైన్ సుమారు 100 మీటర్లు దూరం ఈడ్చు కెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. రైల్వే ప్లాట్ఫామ్పై ఉన్న ఓ రోగిని ఆసుపత్రికి తరలించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.