కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టమాటా ధర కొండెక్కటంతో చోరుల దృష్టి వాటిపై పడింది. మిగిలిన కూరగాయలను వదిలిపెట్టి టమాటా ట్రేలు మాత్రం మాయం చేశారు. జగ్గయ్యపేట మార్కెట్లో కేజి రూ.70 - రూ.100ల వరకు పలుకుతుండటమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటన కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్లో ఒక కూరగాయల దుకాణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. రూ.6వేలు నష్టం వాటిల్లినట్టు వ్యాపారి సూరిబాబు బాధపడ్డాడు.