ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 28,509 కరోనా పరీక్షలు చేయగా,అందులో 248 మందికి పాజిటివ్ అని తేలింది. ఎక్కువగా కృష్ణా జిల్లాలో 56 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 39 కేసులు వచ్చాయి , తూర్పు గోదావరి జిల్లాలో 38 నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 253 మంది కరోనా నుంచి కోలుకున్నారు.