గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పాత గుంటూరు స్టేషన్ల పరిధిలో రైతు భరోసా కేంద్రాలలో నకిలీ వేప నూనే అమ్మకాలు బయటపడ్డాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా వేప నూనె అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రైతుల ఫిర్యాదు మేరకు వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇంకా ఆటోనగర్ లోని కల్తీ వేప నూనె తయారీ కేంద్రం పై కూడా వ్యవసాయ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి, 9 మంది రైతు భరోసా కేంద్రం సిబ్బంది సస్పెండ్ అయ్యారు.