అనంతపురం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు కుప్పకూలి మృతి చెందిన ఘటన కనేకల్లు మండలంలో చోటు చేసుకుంది. ఆర్టీసీ కండక్టర్, ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు శనివారం ఎన్. హనుమాపురం కు చెందిన తిప్పయ్య(75) భార్య లక్ష్మితో కలిసి చికిత్స కోసం కనేకల్ క్రాస్ ఆర్డిటి ప్రభుత్వాసుపత్రికి బస్సులో బయలుదేరారు. మాల్యం గ్రామం వద్దకు రాగానే బస్సులోనే ఒక్కసారిగా కుప్పకూలి తిప్పయ్య మృతిచెందాడు. ఆర్టీసీ బస్సును మాల్యం గ్రామంలో నిలిపి స్థానిక వైద్యుల చూయించారు. అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు. దీంతో ప్రయాణికులను మరో బస్సులో పంపారు. మృతదేహాన్ని ఆటోలో మృతుడి స్వగ్రామానికి తరలించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులకు కండక్టర్ మారెప్ప తీసుకెళ్లారు.