ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రి మందలించాడని బాలిక ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 26, 2021, 02:58 PM

తండ్రి మండలించాడన్న మనస్తాపంతో బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జెడ్ వీరారెడ్డి కాలనీలో గురువారం చోటుచేసుకుంది.


స్థానికులు పోలీసులకు తెలిపిన మేరకు వివరాలు జెడ్ వీరారెడ్డి కాలనీకి చెందిన సుబ్బయ్య కుమార్తె వీరమ్మ (13) ఇంటిలో ఉన్న హుండీలో నుండి డబ్బులు తీసుకుంది. విషయం తెలిసి తండ్రి మందలించాడు.


దీంతో మనస్థాపం చెందిన బాలిక ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికొచ్చిన తల్లిదండ్రులు తమ కూతురు విగతజీవిగా ఉండడాన్ని చూసి కన్నేరుమున్నీరు అయ్యారు.


సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తము బాలిక మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com