విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏవీఎన్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.