జనసేనాని అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను 2018లో చేసిన పోరాట యాత్ర రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకునేందుకు ఉద్దేశించబడిందని తెలిపారు. అంతేకాదు 'ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు'లోని గిరిజన ప్రాంతాలలో ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, 'గంజాయి వ్యాపారం తో పాటు గంజాయి మాఫియా' గురించి తనకు అనేక ఫిర్యాదులు అందాయని జనసేనాని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.