హైదరాబాద్ : మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కు కరోనా సోకింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకోగా అందులో పాజిటివ్ వచ్చిందని పాటిల్ తెలిపారు. ఈ మేరకు దిలీప్ పాటిల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగానే ఉందని, డాక్టర్ల సలహా తీసుకుంటున్నానని చెప్పారు. నాగపూర్, అమరావతి పర్యటనలో, ఇతర కార్యక్రమాల్లో తనపాటు పాల్గొన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.