మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరనున్నారు. లక్ష్మణ్, బీజేపీ జాతీయ నేతలతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సమాచారం. లక్ష్మణ్ చేరికకు కేంద్ర హోమంత్రి అమిత్షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. లక్ష్మణ్ చేరికపై త్వరలోనే బీజేపీ అధికారిక ప్రకటన చేయనుందని చెపుతున్నారు.2012లో అంతర్జాతీయ క్రికెట్కు లక్ష్మణ్ వీడ్కోలు పలికారు.ఆ తరువాత ఆయన ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టకు మెంటార్గా ఉన్నారు.