ఏపీ పరిపాలన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు బయోమెట్రిక్ ను పర్యవేక్షించాలని పరిపాలన శాఖ మెమో జారీ చేసింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిపాలన శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.