ఏపీ వైఎస్ జగన్పై అసభ్య వ్యాఖ్యలు చేయించడమే కాకుండా నిరసన దీక్ష పేరిట తెదేపా అధినేత చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే చంద్రబాబు సానుభూతి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష అని.ఆ దీక్షకు కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. దీక్షపై చంద్రబాబు తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలన్నారు.తెదేపాను కుట్రలు, కుతంత్రాలు, బూతులకు పెద్ద ఫ్యాక్టరీగా చంద్రబాబు తయారు చేశారని ధ్వజమెత్తారు. బంద్ వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టం జరుగుతుందని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారని నాని గుర్తు చేశారు. ఇలాంటి నేతలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.