ఎవ్వరూ లేనప్పుడు పోలీసుల అండతో దాడులు చేయించడం సరికాదని, చంద్రబాబు దీక్ష ముగిసేలోపు రావాలని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పాలనా అస్తవ్యస్థంగా మారిందన్నారు.13 జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ను, మాదక ద్రవ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకుందని ఇదే విషయాన్ని టీడీపీ బయటపెట్టిందన్నారు.జె-బ్రాండ్లు కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ కేంద్రంగా మార్చారన్నారు. ప్రమోషన్ల కోసం కక్కుర్తి పడి అధికారులు తెలుగుదేశం నాయకులపై కేసులు పెడుతున్నారని బొండా ఉమా ఆరోపించారు.